శంకర్పల్లి, ఆగస్టు 15 : రాష్ట్రంలో పేదలకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కులా మారారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. సోమవారం శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ విడుదల చేసిన పింఛన్ కార్డులను పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ వికారాబాద్ పర్యటన విజయవంతం చేయాలి
షాబాద్, ఆగస్టు 15 : సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం షాబాద్లో జడ్పీటీసీ అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంగళవారం సీఎం కేసీఆర్ వస్తున్నట్లు తెలిపారు. షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, నవాబుపేట మండలాలకు సంబంధించి ఒక్కో మండలం నుంచి ఐదు వేల చొప్పున పార్టీ శ్రేణులను సీఎం సభకు తరలిస్తున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం వరకు అన్ని మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు చేవెళ్లకు చేరుకోవాలని, అక్కడి నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ర్యాలీగా వికారాబాద్కు తరలివెళతాయన్నారు.
స్వామి వివేకానంద యువతకు ఆదర్శం
స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామంలో విగ్రహ దాత కుమార్యాదవ్ ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని సోమవారం సర్పంచ్ మంజులయాదవ్, ఎంపీపీ నక్షత్రం, వైస్ ఎంపీపీ మమత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ శ్రీహరియాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు రవియాదవ్, ఉపసర్పంచ్ షాబాద్ శ్యాంరావులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, చైర్పర్సన్ విజయలక్ష్మి, జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీడీవో వెంకయ్య, తహసీల్దార్ నయీముద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, సర్పంచులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.