పరిగి, ఆగస్టు 15 : వికారాబాద్ జిల్లాకు తొలిసారి వస్తున్న సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలేకడంతోపాటు బహిరంగసభను విజయవంతం చేద్దామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం వికారాబాద్లో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు, సభా ప్రాంగణాన్ని జడ్పీ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి, వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, పైలెట్ రోహిత్రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్ నిఖిల, బీసీ కమిషన్ సభ్యుడు శుభ్రపద్పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్తో కలిసి పరిశీలించారు.
అనంతరం మంత్రి సబితారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు వికారాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని, ఏ సమావేశం నిర్వహించినా వికారాబాద్ జిల్లాలో వ్యవసాయం, ఇతర పరిస్థితులపై ఆరా తీస్తారని చెప్పారు. జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలు మంజూరు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వికారాబాద్కు మెడికల్ కాలేజీ మంజూరు చేశారన్నారు. అనంతగిరిలో మెడికల్ కాలేజీ కోసం 30 ఎకరాల భూమి కేటాయించారన్నారు. రూ.235కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు త్వరలోనే వేస్తారని మంత్రి చెప్పారు. వికారాబాద్ జిల్లాకు తొలి విడుతలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను మంజూరు చేశారని మంత్రి వెల్లడించారు. మోమిన్పేట్ ప్రాంతంలో పలు కంపెనీలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాని అన్నారు. దీంతో జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సామాన్యుడు జిల్లా కలెక్టరేట్కు వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మిగతా ప్రభుత్వ శాఖల సేవలు అందేలా సమీకృత జిల్లా కలెక్టరేట్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. వికారాబాద్లో జిల్లా సమీకృత కలెక్టరేట్కు 34 ఎకరాల భూమి కేటాయించగా రూ.60.70కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టారన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతోపాటు అనుబంధంగా దవాఖాన ద్వారా పేదలకు ఉచితంగా మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. చరిత్రలో మొదటిసారి ఒక నియోజకవర్గానికి సంబంధించిన మూడు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని.. తాండూరులో ఆటోనగర్ నిర్మాణం, పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటు, మార్కెట్ యార్డు కోసం స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని మంత్రి అభినందించారు. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరిని టూరిజం స్పాట్గా తీర్చిదిద్దాలని సీఎంను కోరినట్లు మంత్రి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్ను కోరనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై ఎమ్మెల్యేలు సీఎంకు విన్నవిస్తారని మంత్రి చెప్పారు.
మంగళవారం సీఎం కేసీఆర్ జిల్లా సమీకృత కలెక్టరేట్తోపాటు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సీఎం సభను విజయవంతం చేసేందుకు, సీఎం కేసీఆర్కు ఘనంగా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేపడుతున్నామన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.