పరిగి, ఆగస్టు 13: దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరిం చుకుంటూ స్వతంత్ర వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. వజ్రోత్సవాలలో భాగంగా శనివారం పరిగిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని క్రాస్రోడ్డులో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ నాటి స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకభూమిక పోషించిన మహాత్మాగాంధీ చరిత్ర నేటి చిన్నారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో సినిమా థియేటర్లలో ఉచితంగా ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 16న పరిగిలో మూడు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో అందరూ కలిసి ఒకేసారి జాతీయ గీతాలాపన చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో భారీ జాతీయ పతాకాన్ని విద్యార్థులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల అనిల్రెడ్డి, వివిధ పార్టీల నాయకులు కె.శ్రీనివాస్రెడ్డి, బి.ప్రవీణ్కు మార్రెడ్డి, మలిపెద్ది ప్రభాకర్గుప్తా, ఎ.గోపాల్, మంగు సంతోష్, లాల్క్రిష్ణప్రసాద్, నర్సింహ, హన్మంతు, పి.వెంకటయ్య, మౌలానా, బి.రవికుమార్, రచయిత భాస్కరయోగి, కౌన్సిలర్లు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, చౌడాపూర్ మండలాల్లో స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా శనివారం ర్యాలీలు నిర్వహించారు. పరిగి మండలం రం గాపూర్లో ఎంపీపీ కరణం అరవిందరావు, కులకచర్లలో జడ్పీటీసీ రాందాస్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, దోమలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డిలతోపాటు ఆయా గ్రామా ల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
హోరెత్తిన జాతీయ నినాదాలు..
కొడంగల్, ఆగస్టు 13: కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు. శనివారం గ్రామ గ్రామాన బైక్, ఫ్రీడమ్ ర్యాలీలు నిర్వహించారు. పట్టణంలో ప్ర భుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, ఎంఈవో రాంరెడ్డి, ఉపాధ్యాయులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. బొంరాస్పేట మండల కేంద్రంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, ఎంపీడీవో పాండు, ఎంపీ టీసీలు, సర్పంచ్లు, పోలీసులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్ వాడీ టీచర్లు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జాతీయ పతాకాలు చేతబూని నినాదాలు చేసుకుంటూ వీధులగుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు 75 అంకె ఆకృతిలో కూర్చుని వజ్రోత్సవ స్ఫూర్తిని చాటారు.
సమరయోధుల వేషధారణలో చిన్నారులు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ చౌరస్తా నుంచి బ్లాక్ గ్రౌండ్ వరకు విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ నిఖిల, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పాల్గొన్నారు. బ్లాక్ గ్రౌండ్లో ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం చేశారు. అనంతరం జాతీయ జెండా రంగులో ఉన్న బెలూన్లను గాలిలో ఎగురవేశారు. కార్యక్రమంలో డీవైఎస్వో హన్మంతరావు, డీటీడబ్ల్యూవో కోఠాజీ, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి సుధారాణి, డీడబ్ల్యూవో లలిత కుమారి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, ఎంపీపీ చంద్రకళ, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్ బేగం, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యా ర్థులు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని ధారూరు, మర్పల్లి, బంట్వారం, కోట్పల్లి, మోమిన్పేట, వికారాబాద్, నవాబుపేట మండలాల్లో వజ్రోత్సవ వేడు కల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామాల్లో విద్యా ర్థులతో కలిసి ఫ్రీడమ్ ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో కనిపించారు. కార్యక్రమాల్లో భాగంగా పలు రకాల ఆటల పోటీలు నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా మండలాల అధికా రులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న తిరంగార్యాలీ
తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాల్లో వజ్రోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం తిరంగా అభియాన్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జాతీయ జెండాలను పట్టుకొని ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు 75 మీటర్ల మువ్వన్నెల పతాకంతో దేశభక్తిని చాటుతూ ర్యాలీ నిర్వహించారు. 75 మీటర్ల ఐదు పతాకాలను ఒకే సారి ఇందిరాచౌక్కు రప్పించి దేశభక్తి పాటలతో సమైక్యతను చాటారు. ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందిన జవాన్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తిరంగా అభియాన్ కమిటీ అధ్యక్షుడు యు.రమేశ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.