పరిగి, జూలై 2: వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేందుకు వికారాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో గోదాముల నిర్మాణానికి డీసీసీబీ చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయం పండుగలా మారింది. దీం తో పంటల సాగు విస్తీర్ణంతోపాటు దిగుబడులు కూడా పెరుగుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడికక్కడే నిల్వ చేసేందుకు పీఏసీఎస్ల ఆధ్వర్యంలో డీసీసీబీ పర్యవేక్షణలో నాబార్డు నిధులతో రానున్న ఏడాదిలోపు జిల్లాలో 12 గోదాములను రూ.14.72 కోట్లతో నిర్మించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో చేపట్టిన కొన్ని గోదాముల నిర్మాణాలు తుది దశకు చేరుకోగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కాగా జిల్లాలో వానకాలంలో 5.96 లక్షల ఎకరాల్లో …యాసంగిలో లక్షా20వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి.
డీసీసీబీ పర్యవేక్షణలో..
జిల్లాలోని పీఏసీఎస్ల ఆధ్వర్యంలో డీసీసీబీ పర్యవేక్షణలో గోదాములను నిర్మించడం ద్వారా ఆయా మండలాల్లో సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను అక్కడే నిల్వ చేసే సౌల భ్యం ఏర్పడుతుంది. వానకాలం, యాసంగి సీజన్లలో ఒకేసారి వ్యవసాయ ఉత్పత్తులు వచ్చిన సందర్భంలో వాటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నప్పటికీ నిల్వ చేసే స్థాయిలో గోదాములు లేకపోవడం కొంత ఇబ్బందిగా మారు తున్నది. దీంతో జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గోదామును నిర్మిస్తే ఎక్కడికక్కడే ఆయా వ్యవసా య ఉత్పత్తులను నిల్వ చేసే అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడం ద్వారా గోదాముల ద్వారా సొసైటీల కు నెలవారి అద్దెల రూపంలో ఆదాయం కూడా సమకూరుతుంది.
జిల్లా పరిధిలోని గోదాములు..
జిల్లాలోని పరిగి మండలం రాఘవాపూర్లో 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము, దోమ మండలంలోని బొంపల్లిలో 1500 మెట్రిక్ టన్నులు, కులకచర్ల మండల కేంద్రంలో 1000 మెట్రిక్ టన్నులు, తిర్మలాపూర్లో 2500 మెట్రిక్ టన్నులు, మినీ రైస్మిల్, తట్టేపల్లిలో 1000 మెట్రిక్ టన్నులు, రైతుల శిక్షణా కేంద్రం, యాలాలలో స్టోరేజీ భవనం, కార్యాలయ భవనం, మన్నెగూడలో 1500 మెట్రిక్ టన్నులు, అంగడిచిట్టెంపల్లిలో 1500 మెట్రిక్టన్నులు, పులుసుమామిడిలో 2000 మెట్రిక్ టన్నులు, మన్నెపల్లిలో 2500 మెట్రిక్ టన్నులు, వట్టిమీనంపల్లిలో 500 మె ట్రిక్ టన్నులు, మర్పల్లిలో 2500 మెట్రిక్ టన్నులు, మేకవనంపల్లిలో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణాని కి రూ.14.72 కోట్లను నాబార్డు ద్వారా రుణం తీసుకొని డీసీసీబీ ఆధ్వర్యంలో ఆయా పీఏసీఎస్లు నిర్మాణాలు చేపట్టనున్నాయి.
వీటి నిర్మాణానికి నాబార్డు అతి తక్కువ వడ్డీకి నిధులను మంజూరు చేయనున్నది. వెయ్యి మెట్రిక్ టన్ను ల సామర్థ్యం గల గోదాము నిర్మానానికి రూ. 65 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 10 శాతం నిధులను ఆయా సొసైటీలు భరించాల్సి ఉం టుంది. మిగతా 90శాతం నిధులను నాబార్డు సమకూర్చుతుంది. నాబార్డు నాలుగు శాతం వడ్డీకి రుణాన్ని మంజూరు చేసి..ఆ తర్వాత మూడు శాతాన్ని రిబేట్గా ఇస్తుంది. జిల్లా పరిధిలోని సొసైటీల పరిధిలో గోదాముల నిర్మాణానికి స్థలాన్ని గుర్తించి కేటాయింపులు జరిపిన దగ్గర వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతున్నా యి. పరిగి మండలంలోని రాఘవాపూర్ గ్రా మంలో గోదాము నిర్మాణం పూర్తికాగా.. వట్టిమీనంపల్లిలో పనులు తుది దశలో ఉన్నాయి. పూడూరు, తట్టేపల్లి, కులకచర్లలోనూ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
అన్ని మండలాల్లో గోదాముల నిర్మాణం..
వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడికక్కడే నిలువ చేసేలా ప్రతి మండలంలో గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో రూ.14.72 కోట్లు వెచ్చించి 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల ను నిర్మిస్తున్నాం. ఇందులో ఇప్పటికే రెండు గోదాముల నిర్మాణం పూర్తి కావొచ్చింది. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరగా వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. -మనోహర్రెడ్డి,
డీసీసీబీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా