పరిగి, జూన్ 26: వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సంకల్పం.. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. కాగా తొమ్మిదో విడుత పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అందుకు అనుగుణంగా వికారాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించి జిల్లాలోని 2,70,232 మంది రైతులకు రైతుబంధు డబ్బులను పంపిణీ చేసేందుకు రూ.319,36,64,616 నిధులు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 2,31,964 మంది రైతుల బ్యాంకు ఖాతాల అప్డేట్ చేసే కార్యక్రమాన్ని వ్యవసాయ విస్తరణాధికారులు పూర్తి చేయగా.. వాటిలో 2,31,754 మంది రైతులకు సంబంధించిన వివరాలను మండలా ల వ్యవసాయాధికారులు పరిశీలించారు. ఆ వివరాల ఆధారంగానే రైతుబంధు పథకం డబ్బులను ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. 2018 వానకాలం నుంచి ఈ పథకం ప్రారంభం కాగా ఎనిమిది విడుతల్లో జిల్లాలోని రైతులకు రూ.2211 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందజేశారు.
రంగారెడ్డి జిల్లాలో లబ్ధి పొందనున్న 3,68,559 మంది రైతులు
రంగారెడ్డి జిల్లా రైతులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రైతులు పెట్టుబడి ఖర్చుల కోసం ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు రేపటి నుంచి రైతుబంధు నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాకు రూ.378 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేయ గా 3,68,559 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పంటల ప్రారంభం సమయంలోనే ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ జిల్లా వ్యాప్తంగా రైతుబంధు పథకానికి అర్హులైన వారి జాబితాను ప్రభుత్వానికి అందజేయగా.. ఆ జాబితాను అనుసరించి ప్రభుత్వం నిధులను రంగారెడ్డి జిల్లాకు మంజూరు చేసింది.
డివిజన్ల వారీగా పెట్టుబడి సాయాన్ని పొందనున్న రైతులు
రంగారెడ్డి జిల్లాలో ఐదు వ్యవసాయశాఖ డివిజన్లు ఉన్నాయి. వాటిలో చేవెళ్ల డివిజన్లో 92,819 మంది రైతులు, ఇబ్రహీంపట్నంలో 87,494 మంది, మహేశ్వరంలో 69,149 మంది, రాజేంద్రనగర్లో 14,167 మంది, షాద్నగర్ డివిజన్లో 1,04,930 మంది రైతులున్నారు. కాగా రైతుబంధు నిధులు రానుండటంతో రైతుల్లో మనోధైర్యం పెరిగింది. ఆ డబ్బులతో ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి పంటలను చేసుకుంటామని వారు పేర్కొంటున్నారు.
రేపటి నుంచి పెట్టుబడి సాయం పంపిణీ
రంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి రైతులకు పెట్టుబడి సాయా న్ని అందిస్తాం. ఈ పథకం కింద ఎంపికైన రైతులందరికీ దశ లవారీగా ఆర్థిక సహాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం. జిల్లాలో 3,68,559 మంది రైతులకు రూ. 378 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తాం.
-గీతారెడ్డి, వ్యవసాయశాఖ రంగాడ్డి జిల్లా అధికారి
రైతన్నల హర్షం
ఈ వానకాల సీజన్కు సంబంధించి రైతుబంధు పథకం డబ్బులు ఈనెల 28వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఖరీఫ్ పంటల సాగు ప్రారంభమయ్యే సమయంలో ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని, అందువల్లే ప్రతి సీజన్లోనూ సకాలంలో రైతుబంధు డబ్బులను అం దజేస్తూ రైతాంగానికి అండగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు.
మండలాల వారీగా రైతుబంధు వివరాలు..
వికారాబాద్ జిల్లాలోని బొంరాస్పేట మండలంలో 17,188 మంది రైతులకు రూ.19,98,19,306, దౌల్తాబాద్లో 17,869 మందికి రూ.21,47,91,613, కొడంగల్లో 17,261 మందికి రూ. 23,94,80,903, చౌడాపూర్లో 7,383 మందికి రూ.7,82,78,618, దోమలో 13,779 మందికి రూ.15,39,99,508, కులకచర్లలో 10,411 మందికి రూ.11,91,42,703, పరిగిలో 17,841 మందికి రూ.20,22,47,760, పూడూరులో 16,685 మందికి రూ. 19,40,05,399, బషీరాబాద్లో 13,182 మందికి రూ.19,39,50,537, పెద్దేముల్లో 13,676 మందికి రూ. 18,57,17,802, తాండూరులో 13,157 మందికి రూ.18,26,38,469, యాలాలలో 13,182 మందికి రూ.16,80,28,784, బంట్వారంలో 6,930 మందికి రూ.9,17,56,458, ధారూరులో 14,009 మందికి రూ.15,47,38,109, కోట్పల్లిలో 8,700 మందికి రూ.1,01,64,7432, మర్పల్లిలో 18,839 మందికి రూ.20,00,71,158, మోమిన్పేట్లో 14,561 మందికి రూ. 15,48,65,993, నవాబుపేటలో 17,127 మందికి రూ.16,33,38,924, వికారాబాద్ మండలంలోని 18,452 మందికి రూ.195145140 డబ్బులు మంజూరయ్యాయి.
రైతులకు అండగా ప్రభుత్వం..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులు పంటల సాగులో ఇబ్బందులకు గురి కావద్దనే ఉద్దేశంతో ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.పది వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. రేపటి నుంచి రైతుబంధు నిధు లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. సీఎం కేసీఆర్ అన్నదాతల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు.
-వంగేటి లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు