వికారాబాద్, జూన్ 26: రాజీ మార్గమే రాజమార్గమని.. రాజీ పడితే ఇరువురూ గెలిచినట్లేనని జిల్లా ప్రిన్సిపల్ న్యాయమూర్తి కె.సుదర్శన్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కోర్టులో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్అదాలత్ను నిర్వహించారు. ఇందులో 1,770 కేసులకు రాజీ కుదిర్చారు. ఇందుకు గాను రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాకు 13వ స్థానం లభించింది. ఈ సందర్భంగా జిల్లా ప్రిన్సిపల్ న్యాయమూర్తి మాట్లాడుతూ పగలు, పట్టింపులకు పోయి చిన్న, చిన్న గొడవలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఇద్దరు వ్యక్తులు రాజీ చేసుకోవడం ద్వారా ఇరువురికీ న్యాయం జరు గుతుందన్నారు.
దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. రెండు నెలలకొకసారి ఈ కార్యక్రమం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు ఆయన సూచిం చారు. ఇందులో క్రిమినల్ కేసులు, చెక్కు బౌన్స్ తదితర 1,770 కేసుల్లో రాజీ కుదిర్చినట్లు తెలి పారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తి శ్రీదేవి, ప్రిన్సిపల్ జూనియర్ న్యాయమూర్తి శ్రీకాంత్, అదనపు జూనియర్ న్యాయమూర్తి శ్రుతిదూత, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నారాయణగౌడ్, అశోక్కుమార్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమినాబేగం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్, స్పోర్ట్స్ సెక్రటరీ రాజశేఖర్, న్యాయవాదులు గోవర్ధన్రెడ్డి, వెంకటేశ్, వసుంధర, నాగరాజు, రమేశ్గౌడ్, బాలయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.