పరిగి, జూన్ 22: కందిపంట సాగు విస్తీర్ణం పెంచాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సూచించారు. బుధవారం పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో రైతులకు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి కందుల విత్తనాలు మినీకిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ కందుల సాగుతో మంచి దిగుబడితోపాటు రైతుల ఆదాయం వృద్ధి చెందుతుందన్నారు. పప్పుదినుసుల పంటలు సాగును పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్స హిస్తుందన్నారు. జిల్లాలో ఈసారి పత్తితోపాటు కంది సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాలన్నది సర్కారు ఉద్దేశమని పేర్కొన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు మినీ కిట్స్ రూపంలో కందుల విత్తనాలు ఉచితంగా అందిస్తున్నామన్నారు.ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, సీనియర్ నాయ కులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, ఎంపీడీవో శేషగిరిశర్మ, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్. ఆంజ నేయులు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, మాదారం సర్పంచ్ రాములు, టీఆర్ఎస్ నాయకులు విజయ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధ వారం కులకచర్ల మండల కేంద్రంలో రైతు వేదికలో జాతీయ ఆహారభద్రతా మిషన్ కింద మండలానికి 11.8 క్వింటాళ్ల విత్త నాలు రాగా ప్రభుత్వం ద్వారా ఉచితంగా వచ్చిన కంది విత్తనాలను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వర్షాకాలం సీజన్ వచ్చిన కారణంగా రైతులకు అన్ని విధాలుగా విత్తనాలు, ఎరు వు లను అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మండల వ్యవసాయాధికారి వీరస్వామి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.