కొడంగల్, జూన్ 6: జాతీయ రహదారిపై ఎవెన్యూ ప్లాంటేషన్పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసలుగా మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ముందుగా పట్టణంలో ఏర్పాటు చేసిన మూడు పార్కులు, నర్సరీ, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డిగ్రీ కళా శాల భవనాన్ని, 50 పడకల ప్రభుత్వ దవాఖానను, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరి శీలించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ వరకు పట్టణ, పల్లె ప్రగతి కార్యక్ర మాలు కొనసాగనున్నాయని, ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వ హించాలని సూచించారు. శ్రీహర్ష ఎన్క్లేవ్ వెంచర్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సివిల్ సైప్లె అధికారి, కొడంగల్ మున్సిపల్ ప్రత్యేకాధికారి విమల, వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు డా.శ్రీలతా యాదవ్, మధుసూదన్యాదవ్తో పాటు వైద్యులు డా.మూర్తి, డా.వీణ, డా.శ్రావణి, డిప్యూటీ తహసీల్దార్ సురేశ్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు.
పాఠశాలల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
మన ఊరు-మన బడిలో ఎంపికైన పాఠశాలల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ నిఖిల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా విద్యా శాఖ అధికారి, ఈఈలు, డీఈలు, ఏఈ లు, మండల ప్రత్యేకాధికారులతో మన ఊరు-మన బడి పనుల పురోగతిపై జూమ్ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ. 30లక్షలకు పైబడి ఖర్చు గల పనులకు సంబంధించిన టెండర్లు వెంటనే పిలవా లన్నారు. రూ. 30లక్షల లోపు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టే పనులు ప్రహరీల నిర్మాణం, వంటశాలలు, మరుగుదొడ్లు పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మండలానికి రెండు పాఠశాలల చొప్పున ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.