మర్పల్లి, జూన్ 5: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున మొక్కను నాటి సంరక్షించాలని ఎస్సై రాజేం ద్రప్రసాద్ అన్నారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భం గా మర్పల్లి రైల్వే స్టేషన్ మాస్టర్ జానకీరామరావు ఆధ్వర్యంలో రైల్వే రోడ్డు కు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి ఐఆర్టీఎస్, డీవోఎమ్ (జీ)ఎస్సీ యాదగిరి, టీఐ, జీఈఎన్ దాస్, టీఐ బిదర్ ఏఆర్ మీణ హాజ రయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి జీవికి జీవనాధారం ప్రకృతి అని, ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు. అంతకు ఇంటర్సీటీ ఎక్స్ప్రెస్ను మర్పల్లి స్టేషన్లో నిలుపాలని మండల నాయకులు ఐఆర్టీఎస్, డీవోఎమ్(జి)ఎస్సీ యాదగిరికి వినతి పత్రం సమర్పించారు.
ఇంటర్సీటీ ఎక్స్ప్రెస్ నిలుపడంతో మర్పల్లి, బంట్వారం, కోట్పల్లి, కోహిర్ మండలాల గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి రోజు 150 నుండి 200 వందల మంది వరకు రాకపోకలు కొనసాగిస్తారని పేర్కొ న్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మొహన్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్గుప్తా, సుభా శ్యాదవ్, గౌస్, ఖాజా, నర్సింహులు, వెంకట్, సాయికుమార్ పాల్గొన్నారు.