పరిగి, మే 23: పత్తి రైతులు లాభాలను ఆర్జించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధించేలా అధిక సాం ద్రత విధానంలో పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నది. పాత పద్ధ్దతితో పోలిస్తే కొత్త విధానంలో ఒకేసారి పత్తిని ఏరుడు(సింగిల్ పిక్)తో చాలా లాభాలు ఉంటాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ఏడాది అధిక సాంద్రత విధానంలో పత్తి సాగును ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం కొన్ని సీడ్ కంపెనీలతో సాగు పద్ధతులను ఎంపిక చేసింది. కాగా వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది 500 ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తిని సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు నిర్ణయించా రు. జిల్లాలో వానకాలం సీజన్లో రైతులు 5.96 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు సాగు ప్రణాళికను సిద్ధం చేయగా.. అందులో 2.70 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయాలని భావిస్తున్నారు. గతేడాది 1.91 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా మంచి ధరకు విక్రయా లు సాగి రైతులకు లాభాలొచ్చాయి. అధిక సాంద్రత పద్ధ్దతిలో పత్తిని సాగు చేస్తే మరింత ఆదాయం పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
58 గ్రామాల్లో 500 ఎకరాల్లో..
వికారాబాద్ జిల్లాలో సింగిల్ పిక్ పత్తి సాగుకు వ్యవసాయాధికారులు 58 గ్రామాలను ఎంపిక చేశారు. ఇప్పటివరకు పత్తిని అధికంగా సాగు చేసిన గ్రామాల్లో ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఇతర గ్రామా ల రైతులు కూడా ఈ కొత్త విధానం వైపు మొగ్గు చూపే లా చేసేందుకు వ్యవసాయాధికారులు ఈ గ్రామాలను ఎంపిక చేశారు. వికారాబాద్ మండలంలోని మైలార్దేవర్పల్లిలో నాలుగు ఎకరాలు, సిద్ధులూర్లో మూ డు, కొత్తగడిలో నాలుగు, గోధుమగూడలో నాలుగు ..ధారూర్ మండలంలోని ధారూర్లో ఐదు గ్రామా లు, అవుస్పల్లిలో ఐదు, గడ్డమీది గంగారంలో ఐదు, మర్పల్లి మండలంలోని దామస్తాపూర్లో నాలుగు, కొత్లాపూర్లో మూడు, కోట్మర్పల్లిలో మూడు, కొంశెట్పల్లిలో మూడు, బిల్కల్లో రెండు, మోమిన్పేట్ మండల కేంద్రంలో 15 ఎకరాలు, బంట్వారంలో 15 ఎకరాలు, కోట్పల్లి మండలం రాంపూర్లో నాలుగు, జిన్నారంలో మూడు, కోట్పల్లిలో మూడు, నవాబుపేట మండలంలోని గంగ్యాడలో 15 ఎకరాలు, పరిగి మండలంలోని గడిసింగాపూర్లో ఐదు, రంగంపల్లిలో ఐదు, షోండేపూర్లో ఐదు, మల్కాయ్పేట్లో ఐదు, ఇబ్రహీంపూర్లో ఐదు, దోమ మండలంలోని ఊట్పల్లిలో ఆరు ఎకరాలు, దొంగయెన్కెపల్లిలో మూడు, శివారెడ్డిపల్లిలో మూడు, మోత్కూర్లో ఆరు, దాదాపూర్లో ఆరు, కిష్టాపూర్ లో ఆరు, కులకచర్ల మండలంలోని కులకచర్లలో 15 ఎకరాలు, బండెల్కిచర్లలో 15, చౌడాపూర్లో 30 ఎకరాలు, పూడూరు మండలంలోని కండ్లపల్లిలో 15ఎకరాలు, తాండూరు మండలంలోని బిజ్వార్లో 40 ఎకరాలు, యాలాల మండలంలోని యాలాలలో 10, అగ్గనూర్లో 10, జుంటిపల్లిలో 10, బెన్నూర్లో 10, బషీరాబాద్ మండలంలోని కాసింపూర్లో మూడు, నవాంద్గిలో నాలుగు, నీలపల్లిలో మూడు, పెద్దేముల్ మండలంలోని మంబాపూర్లో ఐదు, కందనెల్లిలో ఐదు, పెద్దేముల్లో 10, తట్టేపల్లిలో ఐదు, ఇందూర్ లో ఐదు, గోపాల్పూర్లో 10, కొడంగల్ మండలంలోని హస్నాబాద్లో 20, పర్సాపూర్లో 20, బొంరాస్పేట్ మండలంలోని మెట్లకుంటలో 10, ఏర్పుమల్ల 10, తుంకిమెట్లలో 10, చిల్ముల్మైలారంలో 10, దౌల్తాబాద్ మండలంలోని బిచ్చాల్లో 20, దేవర్ఫస్లావాద్లో 10, గోకఫసల్వాద్లో 10, చెల్లాపూర్లో 10, దౌల్తాబాద్లో 10 ఎకరాల్లో అధిక సాంద్రత విధానంలో పత్తిని సాగు చేయాలని నిర్ణయించారు.
వ్యవసాయాధికారులకు ప్రత్యేక శిక్షణ..
వికారాబాద్ జిల్లాలో కొత్త విధానంలో పత్తి సాగును రాశీ సీడ్స్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని వ్యవసాయాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ విధానంలో పత్తి సాగుపై జిల్లాలోని వ్యవసాయ విస్తరణాధికారులు, మండలాల వ్యవసాయాధికారులు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులకు ప్రత్యేక శిక్ష ణ కూడా పూర్తైంది. గ్రామ స్థాయిలో రైతులను ఎంపిక చేసి ఈ విధానంపై వారికి అవగాహన కల్పించనున్నారు. తద్వారా ఈ పంట సాగుపై చుట్టుపక్కల గ్రామాల రైతులకు కూడా తెలుపనున్నారు. వానకా లం సీజన్లో వ్యవసాయాధికారులు కొత్త విధానంలో సాగుపై రైతులకు మెళకువలు తెలుపుతూ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటారు.
ఎకరాకు 25వేల మొక్కలు..
కొత్త విధానంలో ఎకరాకు 25 వేల పత్తి మొక్క లు వచ్చేలా విత్తనాలను విత్తనున్నారు. గతంలో సాళ్ల మధ్య దూరం 100 నుంచి 120 సెంటీమీటర్లు ఉండగా దానిని 80సెంటీమీటర్లకు తగ్గిస్తా రు. అలాగే గతంలో మొక్కల మధ్య దూరం 60 నుంచి 90 సెంటీమీటర్లు ఉండగా కొత్త విధానం లో ఆ దూరాన్ని 20 సెంటీమీటర్లకు తగ్గించనున్నారు. తద్వారా ఒక ఎకరంలో సుమారు 25వేల పత్తి మొక్కలు వచ్చేలా విత్తనాలను నాటుతారు. హైబ్రిడ్ రకాల్లో ఎకరాకు 13 నుంచి 15 క్విం టాళ్ల వరకు, నీటి పారకంతో 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పత్తిని ఒకేసారి తెంపడం ద్వా రా కూలీల ఖర్చు కూడా తగ్గనున్నది. ఇప్పటివరకు సాగు చేస్తున్న పత్తిని రెండు, మూడు పర్యాయాలు తెంపాల్సి వస్తుంది. దీంతో కూలీల ఖర్చు అధికమవుతుంది. పత్తి తీసే సమయంలో వికారాబాద్ జిల్లాకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు చెందిన కూలీలు వచ్చి ఆ పనులను చేపడుతారు.
కొత్త విధానంతో పెరుగనున్న దిగుబడులు
ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న అధిక సాంద్రత విధానంలో పత్తి సాగుతో దిగుబడులు పెరుగుతాయి. ఈసారి జిల్లా పరిధిలో 500 ఎకరాల్లో ఈ విధానంలో పత్తిని సాగు చేయనున్నాం. డీలర్ల దగ్గర ఆర్సీహెచ్ 665 రకం విత్తనాలు అందుబాటులో ఉన్నా యి. కొత్త విధానంలో సాళ్లు, మొక్కల మధ్య దూరాన్ని తగ్గించడం ద్వారా ఎకరాకు 25 వేల మొక్కలు వచ్చేలా విత్తనాలను విత్తుకునేందుకు అవకాశం ఉంటుంది. పత్తిని ఒకేసారి తెంపడం ద్వారా కూలీల ఖర్చు కూడా చాలావరకు తగ్గుతుంది. తద్వారా పెట్టుబడి తగ్గిపోయి ఆదాయం పెరుగుతుంది.
-గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి