పరిగి, మే 23 : వికారాబాద్ జిల్లాలో పెద్దఎత్తున తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐల బదిలీలు చేపట్టారు. ఈమేరకు సోమవారం సాయంత్రం బదిలీలు చేస్తూ కలెక్టర్ నిఖిల ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీసీఎల్ఏలో సూపరింటెండెంట్గా పనిచేస్తూ వికారాబాద్ జిల్లాకు కేటాయించబడిన సి.భువనేశ్వర్ ధారూరు తహసీల్దార్గా నియమింపబడ్డారు. ధారూరు తహసీల్దార్గా పనిచేస్తున్న టీ.భీమయ్యగౌడ్ వికారాబాద్ రెవెన్యూ డివిజన్లో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, అక్కడ డీఏవోగా పనిచేస్తున్న జి.అమరేందర్కృష్ణ కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నియమింపబడ్డారు. కలెక్టరేట్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సుధ తాండూరు ఆర్డీవో కార్యాలయంలో డివిజినల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, సెక్రటేరియట్లోని పీఆర్అండ్ఆర్డీలో ఎస్వోగా పనిచేస్తున్న పి.రాంబాబు వికారాబాద్ జిల్లాకు కేటాయించబడగా ఆయనను పరిగి తహసీల్దార్గా నియమించారు.
పరిగి తహసీల్దార్గా పనిచేస్తున్న ఎన్.విద్యాసాగర్రెడ్డి వికారాబాద్ కలెక్టరేట్లో తహసీల్దార్గా, పూడూరు తహసీల్దార్గా పనిచేస్తున్న జి.కిరణ్కుమార్ మోమిన్పేట తహసీల్దార్గా బదిలీ అయ్యారు. కలెక్టరేట్లో హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఎం.శ్రీధర్ మర్పల్లి తహసీల్దార్గా నియమింపబడ్డారు. మోమిన్పేట్ మండల నాయబ్ తహసీల్దార్ కె.రవీందర్దత్ కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్ ఎలక్షన్స్గా, కలెక్టరేట్లో నాయబ్ తహసీల్దార్గా పనిచేస్తున్న వి.విజయ్ను ధారూరు నాయబ్ తహసీల్దార్గా, అక్కడ పనిచేస్తున్న టి.వెంకటయ్యను వికారాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్(పౌర సరఫరాలు)గా నియమింపబడ్డారు.
పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో డీటీ(పౌర సరఫరాలు)గా పనిచేస్తున్న శ్రీనివాస్ తాండూరు మండల డిప్యూటీ తహసీల్దార్ ఎలక్షన్స్గా, అక్కడ పనిచేస్తున్న కె.శ్రీనివాస్ను జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్(పౌర సరఫరాలు)గా, పూడూరు మండల నాయబ్ తహసీల్దార్ యు.ఉమేశ్ను మర్పల్లి నాయబ్ తహసీల్దార్గా, అక్కడ పనిచేస్తున్న నాయబ్ తహసీల్దార్ మోహన్ను పూడూరు మండల నాయబ్ తహసీల్దార్గా నియమించారు. పౌర సరఫరాల శాఖ కార్యాలయం వికారాబాద్లో డిప్యూటీ తహసీల్దార్(పౌర సరఫరాలు)గా పనిచేస్తున్న శ్రీలతను వికారాబాద్ మండల నాయబ్ తహసీల్దార్గా, అక్కడ పనిచేస్తున్న జి.విజేందర్ను పౌర సరఫరాల కార్యాలయం వికారాబాద్లో డిప్యూటీ తహసీల్దార్(పౌర సరఫరాలు)గా నియమించారు. కులకచర్ల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వీరేశ్కుమార్ను ధారూరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, అక్కడ పనిచేస్తున్న ఎంఆర్ఐ చంద్రమోహన్ను పరిగి ఎంఆర్ఐగా, తాండూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బాలయ్య కులకచర్ల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.