-యాచారం, మే 30:యాచారం పోలీస్స్టేషన్ పచ్చదనం, ప్రశాంతతతో సమ్మర్లో కూల్ కూల్గా హరితవనాన్ని తలపిస్తున్నది. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను పోలీసు సబ్బంది నందనవనంగా మార్చారు. సీఐ లింగయ్య అధ్వర్యంలో హరితహారం మొక్కలను వృక్షాలుగా మలుస్తున్నారు. దీంతో పోలీస్స్టేషన్ ఆవరణ ఎటు చూసినా పచ్చని మొక్కలతో కనువిందు చేస్తున్నది. నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై రాకపోకలు సాగించే ప్రయాణికులను సైతం పచ్చని చెట్లు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఠాణాలో ఉన్న వివిధ రకాల నీడనిచ్చే చెట్లు, డిజైన్, తీగజాతి, పూలు, పండ్ల మొక్కలు అందంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మొక్కలు వృక్షాలు కావడంతో మండు వేసవిలో పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలకు చల్లని నీడనిస్తూ ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది.
మొక్కలు వృక్షాలుగా…
పోలీస్స్టేషన్ ఆవరణలో హరితహారం మొక్కలను వృక్షాలుగా మలిచారు పోలీసు సిబ్బంది. గతంలో హరితహారంలో అప్పటి సీపీ, డీసీపీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీపీ, జడ్పీటీసీ, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐ, పోలీసు సిబ్బంది స్టేషన్ ఆవరణలో వేప, జామ, ఉసిరి, టేకు, అల్లనేరేడు, మామిడి వివిధ రకాల డిజైన్, పూలు, పండ్ల మొక్కలను సుమార్ వందకు పైగా నాటారు. వాటికి పోలీసు సిబ్బంది నిత్యం పాదులు చేసి, నీరు పోసి మొక్కలను వృక్షాలుగా పెంచారు. కొన్ని చెట్లు పండ్లనిస్తున్నాయి. పోలీస్స్టేషన్కు వెళ్లగానే పకృతి రమనీయత చూపరులను కట్టి పడేస్తున్నది. సీఐ లింగయ్య, ఎస్ఐలు ప్రభాకర్, పద్మయ్య మొక్కల పెంపకం పక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.చెట్లు ఎండిపోకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎటు చూసినా పచ్చదనమే…
పోలీస్స్టేషన్ ఆవరణ ఎటూ చూసినా పచ్చదనమే దర్శనమిస్తున్నది. పోలీస్స్టేషన్ ముందు, వెనుక బాగాల్లో పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్నాయి. దీంతో స్టేషన్కు వచ్చే వారు చెట్ల కింద కూర్చోని సేద తీరుతున్నారు.పోలీస్స్టేషన్ను హరితస్టేషన్గా మార్చడంతో పోలీసులను ఉన్నత అధికారులు, ప్రజలు అభినందిస్తున్నారు. మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు పోలీస్స్టేషన్ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది.
హరితహారం నిరంతరం కొనసాగిస్తాం
పోలీస్స్టేషన్లో మొక్కలను సంరక్షించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాం. మరిన్ని మొక్కలు నాటేందుకు కృషి చేస్తాం. పచ్చదనంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. ఒత్తిడి జయించి సిబ్బంది సైతం తమ విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. స్టేషన్కు వచ్చే ప్రజలకు పచ్చని చెట్లు నీడనిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కల పెంపకంతో అందం, ఆహ్లాదాన్నిస్తాయి. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలు పెంచాలి.
-లింగయ్య, సీఐ యాచారం