పరిగి, మే 27 : నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం భవన నిర్మాణ పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పౌసుమిబసు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం భవన ప్రారంభోత్సవానికి అన్ని హంగులతో మిగతా పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రధాన రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బీటీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు, గ్రీనరీ, విద్యుత్, ఫర్నీచర్ ఏర్పాటు పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్హాల్, మీటింగ్హాల్, వివిధ శాఖలకు చెందిన గదులను, ఫర్నిచర్ ఏర్పాట్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో ఉపేందర్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, డిప్యూటీ ఈఈ శ్రీధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య ఉన్నారు.