వికారాబాద్ : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతూ ప్రణాళికాభివృద్ధే ధ్యేయంగా మరో దఫా పట్టణ ప్రగతి కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయన్నారు.
మరో 15 రోజుల పాటు పరిగి మున్సిపల్ లోని అన్ని వార్డులో వివిధ కార్యక్రమాలు చేపట్టలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం తొలి రోజు కావడంతో 11వ వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులను వార్డు ప్రజలకు వివరించి, పెండింగ్ లో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.