పెద్దేముల్ : గ్రామాల అభివృద్ధే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కందనెల్లిలో సుమారు రూ. 4లక్షల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, రూ. 4లక్షలతో నిర్మించనున్న ఫార్మేషన్ రోడ్లకు వైస్ ఎంపీపీ మధులత, సర్పంచ్ మోహన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.
మండల పరిధిలోని కందనెల్లి గ్రామంలో సుమారు రూ. 8 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో సీసీ, ఫార్మేషన్ రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మధులత, సర్పంచ్ మోహన్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.