పెద్దేముల్ : టీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించడంలో ఎక్కడ కూడా తగ్గమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్లు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని పాత ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అదే సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇందర్చెడ్ రాజు, పొట్టిపల్లి శ్రీనివాస్ రెడ్డిల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు.
కష్టపడి పనిచేసిన వారికి రానున్న రోజుల్లో పార్టీ పదవులు దక్కుతాయని తెలిపారు. పూర్తి నమ్మకం, విశ్వాసంతోనే మండలానికి నూతనంగా మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ యాదవ్ నియమించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ, మాజీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు కొమ్ము గోపాల్రెడ్డి, జితేందర్ రెడ్డి, సంగమేశ్వర్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ధన్సింగ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు డివై ప్రసాద్, బంగ్ల రఘు పాల్గొన్నారు.