వికారాబాద్ : పెండ్లి బస్సు నీటిలో నీటిలో చిక్కుకుపోయింది. ఈ సంఘటన జిల్లాలోని మోమిన్పేట్ మండలం కేసారంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఓ పెండ్లి బృందం బస్సు కోటపల్లి మండలంలో వివాహ వేడుకలు పూర్తయ్యాక.. తిరుగు ప్రయాణంలో రాత్రి 11 గంటల సమయంలో కేసారం రైల్వే బ్రిడ్జి కింద నీళ్లల్లో బస్సు చిక్కుకుపోయింది.
కాగా, అందులోని పెండ్లి బృందం సభ్యులందరూ సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం తెల్లవారేసరికి పెద్ద ఎత్తున వర్షపునీరు చేరడంతో బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.