విధిగా ఓటరు నమోదు చేసుకోవాలని అధికారులు యువతకు సూచిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరితో ఓటరు నమోదు చేయించే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం నేడు, రేపు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. అధికారులు అన్ని కాలేజీల్లోనూ ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 19 వ తేదీతో ఓటరు నమోదుకు గడువు ముగియనుండగా.. అక్టోబర్ 4న ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు.
వికారాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్త ఓటరుగా పేర్లను నమోదు చేసుకునేందుకు ఈనెల 19వరకు మాత్రమే గడువున్నది. అయితే జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారందరితో ఓటరుగా పేర్లను నమోదు చేయించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం చర్య లు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే గత నెల 26, 27 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓట రు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్నికల యంత్రాంగం… నేడు, రేపు కూడా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అం దువల్ల 18 ఏండ్లు నిండిన వారంతా ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని కాలేజీల్లోనూ ఓట రు నమోదుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను జిల్లా ఎన్నికల అధికారులు నిర్వహిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన వారు ఫారం-6 దరఖాస్తును పూర్తి చేసి అధికారులకు ఇస్తే కొత్త ఓట రు నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. అదేవిధంగా ఆన్లైన్ (ceotelangana.in)లోగాని, మీసే వ ద్వారా కూ డా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుం డా పేరు, చిరునామా తదితర తప్పులుంటే సంబంధిత పోలింగ్ కేంద్రానికెళ్లి సరిచేయించుకోవచ్చు. మరోవైపు అక్టోబర్ 4న ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనున్నది.
భారీగా దరఖాస్తులు..
జిల్లాలో ఆగస్టు 26, 27 తేదీల్లో నిర్వహించిన ప్ర త్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ప్రధానంగా కొత్తగా ఓటరు నమోదుకు అధిక మొత్తంలో దరఖాస్తులొచ్చాయి. జిల్లావ్యాప్తంగా కొత్త ఓటరు నమోదుకు 5,945 దరఖాస్తు లు రాగా అందులో పరిగి నియోజకవర్గం నుంచి 1,826, వికారాబాద్ నుంచి 1,530, తాండూరు నుంచి 723, కొడంగల్ నియోజకవర్గం నుంచి 1,866 దరఖాస్తులొచ్చాయి. అదేవిధంగా ఓటరు గుర్తింపు కార్డుల్లో మార్పులు, చేర్పులకోసం 1,495 దరఖాస్తులు, చిరునామా మార్పుకోసం 696 మంది దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లాలో 8,99,395 మంది ఓటర్లు..
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 8,99,395 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు-4,49, 871 మంది, మహిళలు-4,48,970 మంది, ఇతరులు-36 మంది, సర్వీసు ఓటర్లు-518 మంది ఓటర్లున్నారు. అయితే అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో 2,40,086 మంది ఓటర్లుండగా అం దులో పురుషులు-1,22,282, మహిళలు-1,17, 567, ఇతరులు-8, సర్వీసు ఓటర్లు-229 మంది ఉన్నారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గం లో ఓటర్లు 2,17,551 మంది ఉండగా.. అందులో పురుషులు-1,09,714, మహిళలు-1,07,757, ఇతరులు-నలుగురు, సర్వీసు ఓటర్లు -76 మంది ఉన్నారు. తాండూ రు నియోజకవర్గంలో ఓటర్లు 2,22,177 మంది ఉండగా.. వారిలో పురుషులు-1,08,71 2, మహిళలు- 1,13,407, ఇతరులు-తొమ్మిది మంది, సర్వీసు ఓటర్లు-49 మంది ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,19,581 మంది ఓటర్లుండగా వారిలో పురుషులు-1,09,163మంది, మహిళలు-1,10,239, ఇతరులు-15 మంది, సర్వీసు ఓట ర్లు-164 మంది ఓటర్లున్నారు.
ఓటరు మోదుకు ప్రత్యేక క్యాంపులుజిల్లాలో 18 ఏండ్లు నిం డిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లను నమో దు చేసుకోవాలి. ఇందుకో సం జిల్లాలోని అన్ని పో లింగ్ కేంద్రాల్లో నేడు, రేపు ప్రత్యేక ఓటరు నమో దు కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఆధ్వర్యం లో నిర్వహిస్తున్నాం. అవసరమైన వారు మార్పులు, చేర్పులు కూడా చేసు కోవచ్చు. కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇదే చివరి అవకాశం. – నారాయణరెడ్డి, వికారాబాద్ కలెక్టర్