పరిగి : బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకగా సారెను అందించి ఆదరిస్తుందని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రంగాపూర్ గ్రామంలో మహిళలు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడచులకు అన్నగా బతుకమ్మ కానుకగా చీరను అందించి మహిళా గౌరవాన్ని పెంచడాని తెలిపారు. తెలంగాణ ఆనవాయితీ ప్రకారం అక్కా, చెళ్లేళ్లను సారె అందించే సంప్రదాయాన్ని అనుసరిస్తుందని పేర్కొన్నారు.
చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాన్ని కల్పిస్తూ.. చేనేత చీరను ఆడపడచులకు అందించడం పట్ల మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.