కొడంగల్ : పట్టణ పరిధిలో కులంతర వివాహాలు చేసుకున్న దంపతులకు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రభుత్వం అందించే ప్రోత్సహక నగదును దంపతులకు అందించారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. పట్టణానికి చెందిన గోపాల్, వైష్ణవి అదే విధంగా నాగేష్, శిల్పరాణిలకు రూ. 2లక్షల 50వేల చెక్కును అందించారు. కార్యక్రమంలో డీఎస్సీడీవో మల్లేషం, ఏఎస్డబ్ల్యూవో వీరనందన్, జూనియర్ అసిస్టెంట్ రమేశ్, హెచ్డబ్ల్యూవో మోహన్రెడ్డితో పాటు టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి టీటీ రాములు, దౌల్తాబాద్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్రావు, మాజీ జడ్పీటీసీ మోహన్రెడ్డి, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీములు పాల్గొన్నారు.