వికారాబాద్, డిసెంబర్ 14 : జిల్లాలో ఒకటి నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ మెదడు వాపు వ్యాధి సోకకుండా జేఈ(జపనీస్ ఎన్సపాలిటీస్) వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో (జేఈ) వ్యాక్సినేసన్ పై జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక సంవత్సరం నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ జేసీ టీకా ఇవ్వడానికి సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. పిల్లలందరికీ మున్సిపల్ పరిధిలో, గ్రామ పంచాయతీ అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఏఎన్ఎం, ఆశవర్కర్లతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలందరికీ టీకాలు వేసే విధంగా నోడల్ అధికారులను ఏర్పాటు చేయాలని తెలిపారు.
జిల్లాలో 1 నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలు 1,79,619 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. మెదడు వాపు వ్యాధి పందులు, పక్షులు, క్యూ లెక్స్ దోమల ద్వారా 15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలకు సోకుతుందని వివరించారు. ఈ వ్యాధి సోకకుండా జేఈ టీకా సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. అన్ని గ్రామ పం చాయతీలతో పాటు , పిల్లల తల్లిదండ్రులకు వ్యా క్సినేషన్ పై అవగాహన కల్పించాలన్నారు. గ్రా మ పంచాయతీ కార్యదర్శులు నిర్వహించే గ్రామ సభల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పా ల్వాన్కుమార్, డాక్టర్ మారియా, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, జిల్లా సం క్షేమ శాఖ అధికారి లలితకుమారి, డివిజన్ పంచాయతీ అధికారి అనిత, వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.