పరిగి, మార్చి 25 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పరిగి మండలం జాఫర్పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి లలితను జిల్లా కలెక్టర్ నిఖిల విధుల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా సంబంధిత జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. శుక్రవారం డిఆర్డివొ కృష్ణన్, పరిగి ఎంపీడీవో, ఎంపీవోలు జాఫర్పల్లి నర్సరీని సందర్శించగా నర్సరీ నర్విహణ అస్తవ్యస్తంగా ఉండడంతో డిఆర్డివొ కృష్ణన్ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ సంబంధిత గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.