ఆర్కేపురం : రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని, రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలను నమ్మితే మళ్లీ గోసపడుతామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Reddy) పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే. ఇప్పుడెట్ల ఉందోనన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. రాజకీయ సుస్థిరత (Political stability) , శాంతిభద్రతలు ( Law and order ) ఇచ్చే నాయకుడు కేసీఆర్ (KCR) రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు. కాబట్టే మారుమూల గ్రామాల్లో సైతం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో వెలుగులు విరజిమ్ముతుందని వెల్లడించారు. మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
హైదరాబాద్లో అండర్పాస్లు, ఫ్లై ఓవర్ (Fly overs) లు, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి తదితర కార్యక్రమాలతో నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. రానున్న కాలంలో పెరుగనున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టకొని విజన్తో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. ఎల్బీనగర్ ప్రాంతంలోని ప్రజల కోసం గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో రూ.1200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందుబాటులోనే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు.
త్వరలోనే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రజలకు అందజేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్(Minister KTR) ప్రత్యేక చోరవతో గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి సినీ హీరో రజినీకాంత్ మొచ్చుకున్నారని, కానీ ఈ విషయం ప్రతిపక్షాలకు మాత్రం అర్థం కావడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్గుప్తా, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.