వికారాబాద్ : దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ ఆనంద్కుమార్ తెలిపారు. శనివారం వికారాబాద్లోని అంబేద్కర్ భవన్లో ఎస్పీ కార్పొరేషన్ ద్వారా ఎంపికైన 169 మంది ఎస్సీ లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. వారికి పూర్తి సబ్సిడీపై రూ.50వేల చొప్పున చిరు వ్యాపారం కోసం అందజేయనున్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం కింద రూ.26లక్షలు ఖర్చు చేస్తున్నదన్నారు. స్వంత వ్యాపారం చేసుకోవడానికి రూ.10లక్షలు 60 శాతం సబ్సిడీపై అందిస్తున్నదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వృత్తి నైపుణ్యం కల్పించి పలు రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబడుతాయని తెలిపారు.
10వ తరగతి నుంచి ఐటీఐ, డిగ్రీ ఇంజినీరింగ్, మెడికల్ వరకు పూర్తి ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. ఆ కాలంలో వసతి, భోజన సదుపాయం కల్పిస్తారని వివరించారు. జిల్లా అదపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సరైన చిరు వ్యాపారం ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో ఐడీ ఎస్సీ కార్పొరేషన్ బాబు మోజెస్, డీఎస్స్సీడీవో మల్లేశం, ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్, మెప్మా అధికారి వెంకటేశ్ పాల్గొన్నారు.