పరిగి టౌన్ : డబుల్ రోడ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి అసెంబ్లీలో సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. 2014లో ముఖ్యమంత్రి మండల కేంద్రాల నుంచి నియోజకవర్గాలకు డబుల్ రోడ్లను మంజూరు చేశారని రెండు కిలోమీటర్ల దూరం ఫారెస్టు అనుమతులు లేక రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయన్నారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటైన డాపూర్ మండలంలో కూడా రెండు కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణ పనులకు ఫారెస్టు అనుమతులు లేక నిర్మాణ పనులు నిలిచాయని వెంటనే నిర్మాణ పనులకు అనుమతివ్వాలని ఆయన కోరారు.