బడంగ్పేట(వికారాబాద్) : పెండింగ్లో ఉన్న చెరువు సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Reddy ) అన్నారు. మీర్పేట (Meerpeta) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మంత్రాల చెరువును, వరద నీటి కాల్వలను, మ్యాన్ హోల్స్ను ఆమె పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువు(Ponds) లోకి మురుగు నీరు పోకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. చెరువు సుందరీకరణ పనులు ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు.
ముంపు కాలనీలలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మ్యాన్ హోల్స్లలో చెత్త చెదారం ఉన్నా తొలగించాలన్నారు. ఆర్కేపురంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి హరిపురి, జనప్రియ గార్డెన్, సరోజినీనగర్ కాలనీల్లో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ , రోడ్లు, వరదనీటి సమస్యను అధికారులు, కాలనీ వాసులతో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పైల్లైన్ సామర్ధ్యం పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలం కంటే ముందుగానే డ్రైనేజీలో ఎప్పటికప్పుడూ పూడికతీతను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తదితరులు ఉన్నారు.