పరిగి, జనవరి 17 : కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ అన్నారు. మంగళవారం పరిగిలోని పురపాలక సంఘం కార్యాలయంలో కంటి వెలుగు అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమంలో ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఒకటో వార్డులో కంటి వెలుగు ప్రారంభోత్సవానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి అనిల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, కౌన్సిలర్లు నాగేశ్వర్, మునీర్, నాయకులు మౌలానా, తాహెర్అలీ, అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 19 నుంచి చిట్యాల్లో ..
ఈనెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చిట్యాల్లో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారని పరిగి ఎంపీడీవో శేషగిరిశర్మ, మండల వైద్యాధికారి నవ్య తెలిపారు. మంగళవారం పరిగి మండలం చిట్యాల్లో మాక్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించిన వారు మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కండ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు. శనివారం, ఆదివారం, ప్రభుత్వ సెలవు రోజుల్లో కంటి పరీక్షలు నిర్వహించబడవని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో దయానంద్ పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
‘కంటి వెలుగు’ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర తెలిపారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ సిబ్బందికి కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన కల్పించి, సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు విజయవంతం చేయాలని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలు, అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మున్సిపల్ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని 1, 24, 31 వ వార్డులలోని కంటి వెలుగు శిబిరాలను సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి, సౌకర్యాలు కల్పించేందుకు సిబ్బందిని ఆదేశించారు.
పేదల జీవితాల్లో వెలుగులు..
మండల పరిధిలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ పరిధిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణిల అధ్యక్షతన వేర్వేరుగా సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో అమలులో లేని విధం గా తెలంగాణలో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించి పేదల జీవితా ల్లో వెలుగులు నింపుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మధుసూదన్రావు యాదవ్, రమేశ్, ప్రభాకర్గౌడ్, వెంకట్రెడ్డి, కంటి వెలుగు కార్యక్రమం ప్రత్యేకాధికారి సారంగపాణి, డిప్యూటీ తహసీల్దార్ సురేశ్కుమార్, ఎంపీడీవో పాం డు, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్లతో పాటు ఆయా శాఖల అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నమన్వయంతో పని చేయాలి
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎల్పీవో శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తమ బాధ్యతలను నిర్వహించాలని సూచించారు. ఏ ఏ శాఖ అధికారులు ఏ పనులు చేయాలో ఆయన సమావేశంలో వివరించారు. అనంతరం మండల కేంద్రంలోని పలు ఇంటింటికీ కంటి వెలుగు ఆహ్వాన పత్రికలను ప్రజలకు అందజేశారు. జిల్లా టీబీ నియంత్రణ ప్రోగ్రాం అధికారి రవీంద్ర యాదవ్ బొంరాస్పేటలో కంటి వెలుగు వైద్య శిబిరంను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పాండు అధికారులు పాల్గొన్నారు.
అందరి సహకారంతోనే అంధత్వ నిర్మూలన
తెలంగాణ ప్రభుత్వం నిరుపేద ప్రజల్లో అంధత్వ నిర్మూలన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని విజయవంతం చేయాలని కంటి వెలుగు మండల స్పెషల్ ఆఫీసర్ లలిత కుమారి అన్నారు.మంగళవారం మం డల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మప్ప అధ్యక్షతన కంటి వెలుగుపై ఆయా శాఖ ల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు.కార్యక్రమం లో ఎంఆర్వో విద్యసాగర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బుచ్చిబాబు, ఎంపీవో షేక్ సుష్మ, ఆయా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలి
కులకచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులకు కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ రాందాస్ నాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో చాలా మంది కంటి పరీక్షలు చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని వారిని దృష్టిలో పెట్టుకొని ప్రభు త్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. కులకచర్ల మండల ప్రత్యేక అధికారి హన్మంతరావు మాట్లాడుతూ కంటి వెలుగు కేంద్రాల దగ్గర అన్ని వసతులు ఉండే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో కులకచర్ల గ్రామ సర్పంచ్ సౌమ్యావెంకట్రాంరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శంకర్నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కంటి వెలుగు కేంద్రాల పరిశీలన
కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎల్పీవో అనిత అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పట్లూర్, మర్పల్లి కంటి వెలుగు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. మర్పల్లిలో వైద్య సిబ్బంది మాక్ టెస్టింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, ఆర్ఐ మాధవ రెడ్డి, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
మోమిన్పేట మండల పరిధిలో..
‘కంటి వెలుగు’ కోసం సర్వం సిద్ధం చేసినట్లు ఎంపీడీవో శైలజారెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని మోమిన్పేట, ఎన్కతల గ్రా మాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రాల్లో అన్ని సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు.ఉదయం 9 నుంచి సా యం త్రం 4 గంటల వరకు శిబిరాలు కొనసాగుతాయని, ప్రతి రోజూ 120 నుంచి 130 మందికి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యే కాధికారి చరిత, పంచాయతీ కార్యదర్శులు నర్సింహులు, మహిపాల్ రెడ్డి ఉన్నారు.
ఎవరూ అంధత్వంతో బాధపడరాదనే..
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో బాలయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మద్వాపూర్ జీపీ భవనంలో మంగళవారం కంటి వెలుగు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం దర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఒక్కరూ అంధత్వంతో బాధ పడరాదన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గోవిం ద్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్లు, సిబ్బందికి సహకరించాలి
‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మం డల ప్రత్యేకాధికారి రాజేశ్వర్, మండల ఎంపీడీవో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మం డల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో కంటి వెలుగు పై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రా మాల్లో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చే డాక్టర్లకు ప్రజలు సహక రించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశ్పక్స్రూల్, ఎంపీవో డానియల్ ఏఎస్సై అంబాదాస్, డాక్టర్లు, అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.