పూడూరు : దామగుండం రామలింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండలం దామగుండ రామలింగేశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి బాధ్యతల స్వీకరణ, గోమాత సంరక్షణ, వృక్ష సంపద పెంపొందించే కార్యక్రమం సత్యనందస్వామి, సర్పంచ్ నవ్యరెడ్డిల ఆధ్యర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా స్థానిక ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ కులమాతలకు అతీతంగా కమిటీని ఏర్పాటు చేసి దేవాలయ అభివృద్ధికి కృషి చేయలన్నారు.
దామగుండ రామలింగేశ్వరస్వామి ఆలయం ఎంతో పూరతనమైన దేవాలయం అని ఈ ప్రాంతాన్ని చూస్తేనే అర్థమౌతుందన్నారు. స్థానికుల కోరిక మేరకు దామగుండం ప్రాంతంలో ఏర్పాటు చేసే నేవిసిగ్నల్ కేంద్రం నిర్మాణంపై వచ్చే పార్లమెంట్ సమావేశంలో మాట్లాడుతనన్నారు. అవకాశం ఉంటే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేసేలా కృషి చేస్తానన్నారు. దామగుండంలో అమృతంగమయ ఎన్వీరాన్మెంటల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమాత రక్షణ, వృక్షాల సంరక్షణను ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. రైతులు గోవదకు గోవులను విక్రయించకుండ ఉంచుకొని, గోవు మృతి చెందాక అంత్యక్రియలు చేసే రైతుకు ట్రస్ట్ ద్వారా రూ. 35వేలు అందజేయడం సంతోషకరమైన విషయం అన్నారు.
దామగుండం దేవాలయం అభివృద్ధి కోసం తనవంతుగా స్వచ్ఛందంగా రూ. 1లక్ష విరాళం ఇస్తానని ఎంపీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ దేవాలయం చుట్టూ ఉన్న ఫారెస్ట్ భూముల్లో నేవిసిగ్నల్ కేంద్రం ఏర్పాటుకు సరైన ప్రజాభిప్రాయం సేకరించకుండ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఫైల్ ఉందని పేర్కొన్నారు. దామగుండం దేవాలయానికి వచ్చే రోడ్డు నిర్మాణంకై కృషి చేస్తామన్నారు. నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులు దేవాలయ అభివృద్ధికి కృషి చేయలన్నారు. దేవాలయంపై రూ. 10లక్షలు ఫిక్స్ డిపాజిట్ చేస్తే దేవాదాయ శాఖ నుంచి రూ. 40లక్షలు మంజూరు అయ్యేలా తనవంతు కృషి చేస్తానన్నారు.
దేవాలయానికి ఉన్న33 ఎకరాల భూమిని సర్వే చేయించి దేవాలయంకే ఉండేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అనిల్రెడ్డి, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు నర్సింహారెడ్డి, కిషన్ నాయక్, ఉప సర్పంచ్ రాజేందర్, తాజొద్దీన్, కృష్ణగిరిస్వామి, దేశ్పాండే, ఈఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, రైతు మండల సమన్వయ సమితి కన్వీనర్ రాజేందర్రెడ్డి, అనంతరెడ్డి ఉన్నారు.