వికారాబాద్, ఆగస్టు 4 : వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ జయకుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా దవాఖానను సందర్శించారు.
వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. దవాఖాన సౌకర్యాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ..దవాఖానలో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.ల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో, ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయన్నారు.
అవసరమైన వైద్యులు, సిబ్బందిని పెంచుతామని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని ఆయన వివరించారు. వారి వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రదీప్, వైద్యులు శాంతప్ప, ఆనంద్ తదితరులు ఉన్నారు.