తాండూరు రూరల్ : తాండూరులో అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేశారని, త్వరలో పనులు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి హామీ ఇచ్చారని మండల టీఆర్ఎస్ నాయకులు ప్రకాశ్, మాజీ సర్పంచ్ మల్లప్ప, చంద్రప్ప, కోతి గోపాల్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపినట్లు వివరించారు. దళితుల అభివృద్ది కోసం సీఎం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని సంక్షేమ, అభివృద్ధి పథకాలు దళితుల కోసం ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. త్వరలోనే తాండూరులో అంబేద్కర్ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వారు తెలిపారు.