కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని న్యామతాపూర్ గ్రామానికి చెందిన మారెమ్మకి రూ. 20వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైంది. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారురాలి కుటుంబ సభ్యుడికీ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్తో నిరుపేదలకందరికీ కార్పొరేట్ దవాఖానల్లో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, నరేశ్నాయక్, రామకృష్ణ, వెంకటేశ్ పాల్గొన్నారు.