వికారాబాద్, జనవరి 17 : సీసీ కెమెరాలు గ్రామానికి రక్షణ కవచంలా పని చేస్తాయని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్దేవరంపల్లి గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్రపోషిస్తాయన్నారు. గ్రామంలో ఎలాంటి గొడవ జరిగిన సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించవచ్చని తెలిపారు. ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేస్తే గ్రామానికి వచ్చివెళ్లే వారి కదలికలను తెలుసుకోవచ్చని వివరించారు. అనంతరం గ్రామానికి చెందిన ఇతరపార్టీల నాయకులు ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్కండువాను కప్పుకొని పార్టీలో చేరారు. కార్య క్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, సర్పంచ్ తిరుపతిరెడ్డి, తదితరులు ఉన్నారు. అలాగే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేటలో ఉదయం మార్నింగ్ వాక్లో భాగంగా 4వ వార్డులో పర్యటించారు. వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, నాయకుడు వేణుగోపాల్, తదితరులు ఉన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని పాతూర్ గ్రామంలో మైసమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు.