వికారాబాద్, నవంబర్ 11 : బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్రి నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. పనుల్లో జాప్యం చేయకుండా వేగంగా పనులు చేయాలన్నారు. నాణ్యత ప్రమానాలు పాటిస్తూ, ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ప్రణాళిక ప్రకారం పనులు చేయాలని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి అయితే ఆటుగా వెళ్లేవాహన దారుల ప్రయాణాలకు కొంత మేరకు ఇబ్బందులు తగ్గుతాయని వివరించారు.
అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ ఇంటి ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. విద్యకు విశిష్టమైన సేవలు అందించి, దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన స్వాతంత్య్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి అని ఎమ్మెల్యే ఆనంద్ గుర్తు చేశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, ధారూరు మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.