కొందుర్గు, మే 23: రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివా రణ కోసం ఎంతో ముందుచూపుతో అడు గులు వేస్తున్నది. గ్రామ స్థాయిలో గల ఆశ, అంగన్ వాడి కార్యకర్తల ద్వారా గ్రామంలోని ప్ర జలం దరి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని సం బంధిత అధికారులకు వివరాలు తెలుపడం వల్లన కరోనా వచ్చిన వ్యక్తులను సులువుగా గుర్తించి వారికి సరైన వైద్యం అందించేందుకు కృషి చేసున్నారు. కరోనా వ్యాధితో పాటు గ్రామా ల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న వ్యాధుల వివరా లు, వారు వేసుకున్న కరోనా టీకా వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి ఆన్లైన్ చేయడం వల్లన ప్రజల ఆరోగ్య సమస్యలు పూర్తి స్థాయిలో తెలుసుకునే వీలుంటుందనేది ప్రభుత్వ సంక ల్పం. కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలం లో మొత్తం 14500 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు సార్లు సర్వే పూర్తి కాగా ఆదివా రం నుంచి మూడో విడత సర్వే ప్రారం భమైనట్లు అధికారులు తెలిపారు. మండలంలో మొత్తం 64 టీంలు సర్వే చేస్తున్నాయి. ఇప్పటి వరకు 215 మందికి జ్వరం ఉన్నట్లు ధ్రువీకరించారు. జ్వరం వచ్చిన వారికి ప్రభుత్వం నుంచి ఉచి తంగా మందులు పంపిణీ చేశారు. ఏమైన ఇబ్బం దులు ఉంటే వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వా లని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వ నిర్ణయాలకు సహకరిం చాలని వైద్యులు కోరుతున్నారు.
కొనసాగుతున్న కరోనా పరీక్షలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో చేపట్టిన జ్వరసర్వేతో పాటు మండల కేంద్రంలో ప్రతి రోజు కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. గ్రా మాల్లో కరోనా అనుమానితులుగా కనిపించిన వారికి మండల కేంద్రంలో పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వా రంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు. ప్రభు త్వం నుంచి వచ్చిన ఉచిత మందులు వారికి అం దజేస్తున్నారు. ఎలాంటి భయం అక్కరలేదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. బాధితులు అత్యవసర సమయంలో సంబంధిత సిబ్బందికి సమాచారం అందిస్తే మెరు గైన చికిత్స అందించనున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.