ధారూరు : ధారూరు మండల కేంద్రానికి చెందిన మైనారిటీ నాయకులు యూనుస్ (ఇబ్రహీం) సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడటంతో గాయలయ్యాయి. గాయలతో పడి ఉన్న యూనుస్ను వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు చికిత్స నిమిత్తం స్థానికలు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న మైనారిటీ నాయకుడు యూనుస్ను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూరు మండల నాయకులతో కలిసి పరామర్శించారు. దవాఖానలోని వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలన్నారు.
ఎమ్మెల్యే వెంట ధారూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజునాయక్, కార్యదర్శులు కావలి అంజయ్య, రాజుగుప్తా, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేశం, నాయకులు చిన్నయ్యగౌడ్, హఫీజ్ ఖురేషి ఉన్నారు.