దౌల్తాబాద్ : కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని నందారం-సంగాయిపల్లి, కుదురుమల్ల గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఎమ్మెల్యే ప్రత్యేక చోరవతో రూ. 10లక్షల నిధులతో ఫార్మెషన్రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెలే మాట్లాడుతూ ఇప్పటికే నియోజవర్గంలో ఐదు మండలాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో త్వరలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పర్యటన త్వరలోనే ఉన్నట్లు తెలిపారు. నియోజవర్గంలోని కొన్ని పనులు పురోగతి ఉన్నట్లు వెల్లడించారు. ఇక నుంచి అన్ని శాఖల అధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేసేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి బొంరాస్పేట, దౌల్తాబాద్, కొడంగల్ మండలాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి వందల కోట్లా నిధులను ఖర్చు చేయడం జరిగిందన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్పేట, దౌల్తాబాద్, కొడంగల్ మండలాలకు ఆర్అండ్బీ రోడ్లు, పంచాయతీ రోడ్లు అత్యధికంగా మంజూరీ చేశామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఎన్నికల్లో ఇవ్వని హామీల సైతం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దౌల్తాబాద్ మండలంలోని అంతారం గ్రామం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచు వెంకట్రెడ్డిని ఎమ్మెల్యే పరమార్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.