పరిగి : పరిగి పట్టణంలో రూ. 10కోట్లతో కొనసాగుతున్న పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ అధ్యక్షతన శనివారం పరిగి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు త్వరగా, నాణ్యతగా జరిగేలా చూడాలన్నారు. తాసిల్దార్ కార్యాలయం నుంచి జడ్పీహెచ్ఎస్ నెం.1 వరకు బీటీ రోడ్డుకు బదులు సీసీ రోడ్డు నిర్మాణానికి నిర్ణయించారు. బీటీ రోడ్డు వల్ల వర్షాకాలంలో రోడ్డు త్వరగా పాడవుతుందని, సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ నుంచి అదనపు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ మేరకు రూ. 50లక్షలు కేటాయిస్తూ మున్సిపల్ తీర్మాణం ఆమోదించారు. సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించే విధంగా పని చేయాలని సూచించారు. పట్టణంలో నూతనంగా 4 ట్రీ పార్కులు, నర్సరీల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. పార్కుల అభివృద్ధితో చక్కటి వాతావరణం నెలకొంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి వార్డు పరిధిలో రూ. 15లక్షలతో అభివృద్ధి పనులకు తీర్మానించారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ప్రసన్నలక్ష్మీ, కమిషనర్ ప్రవీణ్కుమార్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.