ధారూరు : ధారూరు మండల పరిధిలోని తరిగోప్పుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ గ్రామ సర్పంచ్ కోల్కుంద సంగమేశ్వర్ త్వరగా కొలుకోవాలని వారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం సంగమేశ్వర్ నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుకున్నారు. ఎమ్మెల్యే వెంట ధారూరు మండల పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, దేవేందర్, శ్రీనివాస్, విజయ్కుమార్ ఉన్నారు.