కులకచర్ల : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. అంతారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బోయిని శ్యామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార్టీ తరుపున బీమా చేయించడంతో ఆయన కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మంజూరు అయింది. శనివారం శ్యామ్ తల్లి లక్ష్మమ్మకు రెండు లక్షల చెక్కును టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా నిలుస్తోందన్నారు. ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ తరపున బీమా చేయించడం జరుగుతుందని దీని వలన వివిధ కారణాల వలన టీఆర్ఎస్ కార్యకర్తలు మృతి చెందితే బీమా చేయించుకున్న వారికి రెండు లక్షల బీమా ప్రీమియం వస్తుందన్నారు.
గ్రామస్థాయిలో టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీకి, ప్రభుత్వానికి వెన్నెముకలాంటివారని తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, ఎంపీపీ రాజశేఖర్గౌడ్, ఎంపీటీసీ లలితబుగ్గయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాంలాల్, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజప్ప, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.