వికారాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోట్పల్లి మండలానికి చెందిన 84మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఆనంద్ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో రోజు రోజుకు తిరుగులేని బలమైన శక్తిగా తెరాస పార్టీ ముందుకు సాగుతుందన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నవారిని ఆహ్వానించి వారికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, సర్పంచ్లు, నాయకులు ఉన్నారు.