వికారాబాద్ : భారత దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల ఫలాలు ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనం పొందుతున్న ఫలాలు అని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని సివిల్ సప్ర్లై గోడౌన్లో రేషన్ డీలర్లతో కలిసి 75 సంవత్సరాల అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా అదనపు కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన అమరవీరుల కృషి వలనే మనం ఫలాలు పొందుతున్నామనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాము కానీ, హక్కులను మర్చిపోతున్నామని తెలిపారు. మొదటి బాధ్యతగా ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వలన మన ఆరోగ్యమే కాకుండా పక్కవారికి కూడా కరోనా సోకకుండా ఉంటుందన్నారు. పంట మార్పిడికి పోతే మంచి లాభాలు కూడా వస్తాయని సూచించారు.
75 సంవత్సరాల అమృత్ మహోత్సవంలో భాగంగా వన్ నేషన్ వన్కార్డు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ నెల 16న పరిగి, 24న తాండూరు, 30న కొడంగల్లో అమృత్ ఉత్సవాలు జరుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్వో రాజేశ్వర్, డీఎమ్ సివిల్ సప్లె అధికారిని విమల, జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు జుకారెడ్డి, డీలర్లు, రేషన్ హోల్డర్లు, గోడౌన్ ఇంచార్జీలు పాల్గొన్నారు.