బొంరాస్ పేట : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 200మంది క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం అందించిన ఉచిత దుస్తులను, 39మంది మహిళలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తుందని, ఏటా రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు ప్రభుత్వం ఉచితంగా దుస్తులను పంపిణీ చేస్తుందన్నారు.
పేద మహిళలు తమ ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడరాదన్న ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 1లక్ష 116లు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గినా సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయకుండా సంక్షేమ పథకాల అమలును కొనసాగిస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని వ్యాధులకు కార్పొరేట్ దవాఖానలో చికిత్స పొందే పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇది పేద ప్రజలకు వరంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మహేందర్, ఎంపీటీసీ శ్రవణ్గౌడ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్పాషా, తాసిల్దార్ షాహెదాబేగం పాల్గొన్నారు.
కొడంగల్లో..
కొడంగల్ మండలంలోని హస్నాబాద్లో సోమవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి, నాయకులు సిద్ధి లింగప్ప పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఫకీరప్ప, సయ్యద్ అంజాద్, సాయిలు, సావిత్రమ్మ పాల్గొన్నారు.