కులకచర్ల : నాలుగు సంవత్సరాల క్రితం ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం కులకచర్ల మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డితో కలిసి పుట్టపహాడ్ గ్రామానికి రైతు కుటుంబాని రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. పరిగి నియోజకవర్గంలో చాలామందికి లబ్ధి చేకూరుతోందని వివరించారు.
పుట్టపహాడ్ గ్రామానికి చెందిన రైతు కుమ్మరి వెంకటమ్మ నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ప్రభుత్వం అతని భార్య మంగమ్మకు 5లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కులకచర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, టీఆర్ఎస్ నాయకులు సారా శ్రీనివాస్, బొంబాయి రాములు పాల్గొన్నారు.