ధారూరు : ధారూరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజాపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మయ్యతో పాటు నాయకులు కలిసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని, గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకుపోవాలని తెలిపారు.
మీ గ్రామాన్ని త్వరలో పర్యటించి గ్రామ సమస్యలను తెలుసుకోని విడతల వారీగా సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య, నాయకులు శ్రీశైలం ఉన్నారు.