బొంరాస్పేట : మండలంలోని బాపన్చెరువుతండాకు చెందిన విద్యార్థి పవార్ అనిల్కుమార్ ఐఐటీ ఖరగ్పూర్లో బయో టెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో సీటు సంపాదించాడు. అనిల్కుమార్ మండలంలోని రేగడి మైలారం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశపరీక్ష రాసి ఖమ్మం జిల్లా దమ్మపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాసి 346వ ర్యాంకు సాధించాడు. సోమవారం ఐఐటీ ఖరగ్పూర్లో అనిల్కుమార్ సీటు సంపాదించాడు. విద్యార్థిని పాఠశాల హెచ్ఎం మల్లికార్జున్, ఉపాధ్యాయులు, తండా ప్రజలు అభినందించారు.