వికారాబాద్ : రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపి మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి సబితారెడ్డి. శుక్రవారం వికారాబాద్ డెంటల్ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ పర్యటన నిమిత్తం వచ్చిన మంత్రి కాన్వాయ్లో తిరిగి వెళ్తుండగా డెంటల్ కాలేజీ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని, షిఫ్ట్ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. బైక్పై ఉన్న వ్యక్తులు గాయాలపాలై రోడ్డు పక్కన పడి ఉన్నారు. గమనించిన మంత్రి కాన్వయ్ని ఆపి తన పోలీసు వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.