పెద్దేముల్ : మండలానికి రూ. 3. 50కోట్ల రూపాయల జెడ్పీ నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రూ. 10లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనం, రూ. 15లక్షలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, రూ. 15లక్షలతో నిర్మించిన గెస్ట్హౌజ్, 7లక్షలతో మారేపల్లిలో నిర్మించిన బస్ షెల్టర్, రూ. 5లక్షలతో రుద్రారంలో నిర్మించిన సీసీరోడ్డు, రూ. 10లక్షలతో గాజీపూర్లో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని, రూ. 3 లక్షలతో రేగొండిలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి, రూ. 5లక్షలతో మంబాపూర్లో నిర్మించబోతున్న మహిళ మండలి భవనానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో సుమారు రూ. కోటి జెడ్పీ నిధులతో 5 గ్రామాల్లో పలు రకాల అభివృద్ధి పనులను ప్రారంభించండం జరుగుతుందని, గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా ముందుంటామని, ప్రతి మండలానికి ఒక అతిథి గృహాన్ని మంజూరు చేసి నిర్మించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అన్ని మండలాల్లో జెడ్పీ నిధులతో సీసీరోడ్లు, పలు రకాల భవనాలు నిర్మిస్తామని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్లు హైదర్, బల్వంత్రెడ్డి, ద్యావరి విజయమ్మ, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, తట్టేపల్లి పీఎసీఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, డివై నర్సింలు, మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ ధారాసింగ్, ఎంపీడీవో లక్ష్మప్ప, టీఆర్ఎస్ నాయకులు, వివిధ మండలాల నాయకులు, యువ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.