పూడూరు : అందరి సమ్మతితోనే మైనింగ్ అనుమతులు ఇవ్వడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. గురువారం పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలోని మైనింగ్ తవ్వకల కోసం ప్రజాభిప్రాయ సేకరణ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మిర్జాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 41లోని 166ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా అందులో 130ఎకరాల భూమి స్థానిక రైతులకు గతంలోనే వ్యవసాయసాగు కోసం ఇచ్చారు. మిగులు భూమిలోని 26ఎకరాల మైనింగ్ అనుమతుల ఏస్సార్ మినరల్స్ సంస్థ 2017లో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గురువారం అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయగా కొందరు రైతులు తమ భూములను సర్వే చేసి తమకు హద్దులు చూయించాలని కోరారు.
స్థానిక రైతులు, ఎన్జీవోలు (స్వచ్ఛంద సంస్థ) సభ్యులు వారి వారి అభిప్రాయాలను సమావేశంలో తెలిపారు. రైతుల, ఎస్జీవో అభిప్రాయాలను అదనపు కలెక్టర్ రికార్డు చేసుకున్నారు. కార్యక్రమంలో మైనింగ్ ఎడి సాంబశివుడు, తాసిల్దార్ కిరణ్ కుమార్, రైతులు ఉన్నారు.