కులకచర్ల, డిసెంబర్ 4: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కోసం దర ఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ ఆర్డీవో అరుణకుమారి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓటరు నమోదు కార్య క్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమన్నారు. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఎంతగానో ఉపయోగప డుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కోసం దర ఖాస్తు ఫారం-6 నింపి అందించాలన్నారు. డీటీడబ్ల్యూవో కోటాజీ మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఓటుహక్కు అనే చాలా విలువైనదని, డబ్బులతో ఓటును అమ్ముకోకుండా స్వచ్ఛందంగా సేవ చేసే నాయకుడిని ప్రజాప్రతినిధినిగా ఎన్నుకోవాలని సూచించారు.
ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేసే నాయకులను ఎన్నుకుంటే పరిపాలన సక్రమంగా సాగుతుందన్నారు. పాలకులకు, ఉద్యో గులకు జీతాలు ఇచ్చేది ప్రజలేనని ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల బోగోగుల కోసం పని చేయాలని ఈ విషయాన్ని విద్యార్థులు గ్రామాల్లో తమ తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో కులకచర్ల తహ సీల్దార్ రమేశ్కుమార్, తహసీల్దార్ సూపరింటెండెంట్ శ్రీనయ్య, బండవెల్కిచర్ల బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి, నాయకులు లక్ష్మారెడ్డి, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటరుగా నమోదు చేసుకోవాలి
పెద్దేముల్, డిసెంబర్ 4 : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజురెడ్డి అన్నారు.ఆదివారం మండల పరిధి లోని మంబాపూర్లో సిబ్బందితో కలిసి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3,4 తేదీల్లో రెండు రోజులపాటు రాష్ట్ర ఎన్నికల కమీషన్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోని వారి కోసం ప్రత్యేకంగా ఓటరు నమోదు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించినట్లు తెలిపారు. 18 సంవత్సరాల నిండిన యువతీయువకులు ఆయా గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు నమోదు చేసుకోవాలని కోరారు.