కులకచర్ల : డాపూర్ మండలం బొర్రహేమ్యతండా గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయస్వామి విగ్రహప్రతిష్టాపన చేశారు. అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి రూ. 20వేలు విరాళంగా అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.